ఖైరతాబాద్ గణేష్ 2020 దన్వన్తరి నారాయణ మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు .

ఆ మహా గణపతికి ఒక వైపు లక్ష్మీ దేవి అలాగే ఒక వైపు సరస్వతీ దేవి ఆసీనులై వున్నారు . ఈ సారి గణపతి దన్వన్తరి నారాయణ మహా గణపతిగా ఎందుకు ఆసీనులైనారు అంటే ఖైరతాబాద్ గణేష్ ఫౌండర్ సుదర్శన్ ముదిరాజ్ చెప్పిన విషయం ఈ ప్రపంచంలో అందరు కరోనా వాళ్ళ చదువులు అలాగే ధనమును కోల్పోతున్నారు . ఈ రెండూ మనకి ముఖ్యము అందుకని గణేశుడు ఇద్దరు అమ్మవార్లతో మన కష్టాలు తీర్చటానికి ఈ రూపంలో దర్శనం ఇస్తున్నాడు అని అన్నాడు . తెలంగాణ ప్రభుత్వం కరోనా దృష్ట్యా గణపతిని మూడు ఫీట్లు నిర్మించమంటే గణేష్ కమిటీ మాత్రం 9 అడుగులు ఏర్పాటు చేసారు . ఈ సరి వినాయకుని విగ్రహాన్ని మట్టి తో చేయడం విశేషం . అలాగే కమిటీకూడా అక్కడకి వచ్చే భక్తులు కరోనా నియమాలు పాటించేలా చేస్తున్నారు . మాస్క్లు లేనిదే ఎంట్రీ లేదు అలాగే భక్తుల క్యూ లైన్లో శానిటైజర్ స్ప్రే టన్నెల్ కూడా ఏర్పాటు చేసారు . టెంపరేచర్ టెస్టింగ్ హ్యాండ్ శానిటైజర్ కూడా ఏర్పాటు చేసారు .
కమిటీ కూడా ఖైరతాబాద్ గణేష్ ని భక్తుల కోరిక మేరకు హుసైన్ సాగర్ లోనే నిమ్మజనం చేయాలనీ నిర్ణయించారు . కమిటీలోని 50 మందితో ఊరేగింపు తో వెళ్లాలని అంతలోపు ఈ మహమ్మారి కరోనా అంతం అవ్వాలని ఫౌండర్ సుదర్శన్ ముదిరాజ్ అన్నారు . భక్తులుకూడా కరోనా వున్నా ఆ మహా గణపతిని దర్శించుకోవాలని తండోప తండోపాలుగా వస్తున్నారు . ఈ మహా గణపతిని చుస్తే సాక్షాతూ దేవుణ్ణి చూసినట్టే ఉంటుంది అని కొత్త మంది అంటే , ఎత్తు తక్కువగా ఉండడం బాధగా వున్నా ఆ రూపంలో తేజస్సు ఎక్కడ ఉండవు అని అంటున్నారు . ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఎంత ఎత్తులో వున్నా ఏరూపంలో వున్నా భక్తుల తాకిడి మాత్రం ఆగదు అనేడి స్పష్టం అయింది . జై గణేష్ మహారాజ్ కి జై …
Jai bolo ganesh maharaj ki