నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని ఎక్కువకాలం నిర్వహించిన కాంగ్రెస్సేతర మొదటి ప్రధానిగా భారత రాజకీయ చరిత్రలో నిలిచారు. భారత దేశం మొత్తం ప్రధాన మంత్రులతో పోలిస్తే సుదీర్ఘ పదవిని నిర్వహించిన నాల్గవ ప్రధాని నరేంద్ర మోడీ. అటల్ బిహారీ వాజ్పేయి మొత్తం 2268 రోజుల వ్యవధి పదవిని చేపడితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ దానిని అధిగమించాడు . మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మూడుసార్లు ప్రధాని పదవి చేపట్టి మొత్తం 2268 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. ప్రధానిగా మోడీ మాత్రం రెండోసారి పదవి చేపట్టి వాజ్పేయి 2268 రోజులను అధిగమించాడు .

నరేంద్ర మోడీ 2014 మే 26 న మొదటిసారిగా దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.2019 లోక్సభ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డిఎ మెజారిటీ సాధించిన తరువాత మోడీ 2019 మేలో రెండోసారి ప్రధానిగా ఎన్నిక కబడ్డాడు . రెండో సారి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధాని మోదీ. ప్రధాని మోడీకి ముందు కాంగ్రెసేతరులు ఎవరు వరుసగా రెండోసారి ప్రధాని కాలేదు . ప్రధాని మోడీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పదవీకాలం అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.
కాంగ్రెసేతర ప్రధానమంత్రుల విషయానికి వస్తే మోడీ, అటల్ బిహారీ వాజ్పేయిల తర్వాత మొరార్జీ దేశాయ్ పేరు చెప్పుకోవచ్చు . 1977 లో కాంగ్రెస్ను ఘోరంగా ఓడించిన తరువాత కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ విడిపోయి అతని ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే పడిపోయింది . కాంగ్రెసేతర ప్రధానమంత్రులలో మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్లు కాక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, హెచ్డి దేవేగౌడ , గుజ్రాల్ ఒక సంవత్సరం పదవి కాలపరిమితిని పూర్తీ చేసారు .
అయోధ్య ప్రధాని మోడీ రామాలయ భూమిపూజ | ఈ పెద్ద నాయకులకు పిలుపు లేదు