బల్కంపేట అమ్మవారి విగ్రహం వరకు వరద నీరు చేరింది . మంగళవారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురుసున్న వర్షం కారణంగా హైదరాబాద్లో వరద నీరు పోటెత్తిన సంగతి తెలిసిందే .

బల్కంపేట అమ్మవారి
అమీర్ పెట్ లోని బల్కంపేట పోచమ్మ అమ్మవారు చాల ప్రసిద్ధి చెందిన దేవాలయం .భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు . అమ్మవారి కళ్యాణంకు అన్ని ప్రాంతాలనుండి భక్తులు వస్తారు . అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షానికి వరద నీరు హైదరాబాద్ ఒక చోటు అని కాకుండా మొత్తం ఎక్కడ చుసిన కాలనీలు సైతం నీరు చేరింది . గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తున్న మంగళవారం కురిసిన వాన చాల బీభత్సము గా కురిసింది . దాదాపు హైదరాబాద్ మొత్తం దాదాపు 20 సెంటీమీటర్లు పైనే వర్షం పడింది .
అమ్మవారి గుడిలోకూడా నీరు రావడంతో వరదనీరు అమ్మ వారి విగ్రహం వరకు చేరింది .అమ్మవారిని దర్శించు కోవాలి అన్నటుగా వర్షం నీరు చేరిందేమో అన్నటుగా ఉంది . ఇప్పుడు కూడా ఎలాంటి ఉప ద్రవాలు వచ్చిన అమ్మవారే కాపాడుతుంది అని భక్తులు కోరుకుంటున్నారు .
హైదరాబాద్ లో సెం.మీ ప్రకారం వర్ష పాతం చూసుకుంటే
ఘట్కేసర్-32 సెం.మీ
హయత్నగర్- 29.8 సెం.మీ వర్షపాతం
హస్తినాపురం-28.4 సెం.మీ,
సరూర్నగర్- 27.3 సెం.మీ వర్షపాతం
అబ్దుల్లాపూర్మెట్-26.6 సెం.మీ
కీసర- 26.3 సెం.మీ వర్షపాతం
ఇబ్రహీంపట్నం- 25.7 సెం.మీ
ఓయూ-25.6 సెం.మీ
ఉప్పల్- 25.6 సెం.మీ
మేడిపల్లి-24.2 సెం.మీ
కందికల్గేట్-23.9 సెం.మీ
రామంతాపూర్ 23.2 సెం.మీ
బేగంపేట్-23.2 సెం.మీ
మల్కాజ్గిరి-22.6 సెం.మీ
అల్వాల్ 22.1 సెం.మీ
ఖైరతాబాద్ కూకట్పల్లి, శేరిలింగంపల్లి 20 సెం.మీ
ఆసిఫ్నగర్, సైదాబాద్లో 20 సెం.మీ
Also Read
హైదరాబాద్ మెట్రోకీ ప్రమాదమా? Tense -పిల్లర్ ప్రక్కన కుంగిన భూమి