వైఎస్సార్ జలకళ సీఎం జగన్ చేతులమీదుగా ఇవాళ ప్రారంభం కాబోతుంది . జగన్ సర్కార్ నవరత్నాలు లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది . దానిలో భాగంగానే ఈ పధకాన్ని ప్రవేశ పెడుతుంది .

వైఎస్సార్ జలకళ
సన్న ,చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా పధకం లో భాగంగాన్నే ఈ నిర్ణయం తీసుకున్నారు .
ఈ పధకం కోసం రైతులు తమ గ్రామంలోని గ్రామా వాలంటరీ ల ద్వారా గ్రామా సచివాలయం లో లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్ ,ఆధార్ కార్డు కాపీ తో దరఖాస్తు చేసుకోవాలి . ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు .దరఖాస్తులను గ్రామా సచివాలయ స్థాయి విఆర్వో పరిశీలిస్తాడు .
తరువాత డ్వామా అసిస్టెంట్ డైరెక్టర్ దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం జియాలజీ విభాగానికి పంపిస్తారు .దానిని జియాలజీ విభాగం అనుమతి ఇవ్వగానే డ్వామా పరిపాలన అనుమతి ఇస్తారు .
రైతు భూమి లో ద్రిలింగ్ వేసేముందు హైడ్రో జియోలాజికల్ ,జియోఫీజికల్ సర్వె చేస్తారు .అప్పుడే బోర్లు వేస్తారు .అనంతరం కాంట్రాక్టర్ పొలంలో బోరు వేస్తారు . బోరు బావుల విజయ శాతం బట్టి బిల్లు చెలిస్తారు .
రైతులకు 2. 5 నుండి 5 ఎకరాల మధ్య ఉన్న వాళ్ళే అర్హులు . 2. 5 ఎకరాల కంటే తక్కువ ఉంటె పక్క ఉన్న వారి తో కలిపి వేస్తారు . ఇంకా ఈ పధకం ద్వారా బోరు వేయాలి అంటే ఆ భూమి లో అంతక ముందు బోర్ వేసి ఉండకూడదు .
రైతుకు ఏ రోజు బోరు వేస్తారో ఫోన్ కి మెసేజ్ వస్తుంది . దానికోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వెర్ రూపొందించారు . గ్రామా వాలంటీర్ ద్వారా కూడా సమాచారం అందిస్తారు . ఒక చోట పడక పోతే ఇంకోచోట వేసే వీలు కల్పించారు