సోమేశ్ కుమార్ ఆదేశం ఉద్యోగుల ప్రమోషన్స్ ను వివిధ క్యాటగిరీలలో పనిచేస్తున్న జిల్లా స్ధాయిలోని వివిధ శాఖలలో ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

మంగళవారం బిఆర్ కెఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో అన్ని క్యాటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లు, DPC లు నిర్వహణ కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై సి.యస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారని కలెక్టర్లకు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై వెంటనే జిల్లా స్ధాయిలో సమావేశం నిర్వహించి ప్రమోషన్ల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రమోషన్ల, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ ద్వారా ఈ సీజన్ లో మూడు నెలల ముందుగానే 14.10 కోట్ల పని దినాలు దాటినందుకు అధికారులను అభినందిస్తూ వచ్చే 3 నెలల కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, డ్రైన్ ప్లాట్ ఫామ్స్, సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీలలో ప్లాంటేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యత నిచ్చి సోమేశ్ కుమార్ ఆదేశం ఉద్యోగుల ప్రమోషన్స్ పూర్తి చేయాలనీ ఇచ్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి S.A.M. శ్రీ రిజ్వీ, CIG/సి.యం కార్యదర్శి శ్రీ శేషాద్రి, సీనియర్ కన్సల్టెంట్ శ్రీ శివశంకర్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, యం.డి, టిఎస్ టిఎస్, శ్రీ జి.టి వెంకటేశ్వర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.